Thursday, October 29, 2015

స్లీమన్ కథ-14: ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.
తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సేలోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:
(పూర్తి రచన 'ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/29/%E0%B0%8E%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%95%E0%B1%87%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6/ లో చదవండి)

No comments:

Post a Comment