Thursday, December 26, 2013

యూరపు వరకూ ఆర్యావర్తమే!

మధ్య ఆసియాలో రష్యా, అజర్బైజాన్, ఇరాన్, కజక్ స్తాన్, తుర్క్ మెనిస్తాన్ లను ఆనుకుని ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక జలాశయం ఉంది. అది ఎంత పెద్ద దంటే, దానిని సముద్రంగానే చెప్పుకున్నారు. అదే- కాస్పియన్ సీ. దీనిని మన పూర్వులు కాశ్యపీ సముద్రం అన్నారు. ఆ పేరునుబట్టి ఆ జలాశయం పరిసర ప్రాంతాన్ని కూడా కాశ్యపి అంటూ వచ్చారు. కాశ్యపి అన్నా భూమే. 

విశేషమేమిటంటే, కాశ్యపి ఒకప్పుడు  యూరోపియన్లు, నిగ్రాయిడ్లు, మంగోలాయిడ్లు వంటి అనేక జాతులవారికి, భాషల వారికి ఆవాసం. ఆనాడు జాతులంటే వర్ణాలే. యూరోపియన్లది తెలుపు రంగు, నిగ్రాయిడ్లది నలుపు రంగు, మంగోలాయిడ్లది పసుపు రంగు. సంస్కృతం తోబుట్టువులైన ఇండో-యూరోపియన్ భాషలు; మ్లేచ్ఛ భాషలైన హిబ్రూ, అరబ్బీ, అరమాయిక్, ఆగద, అసుర, ఈజిప్టు భాషలు; చీనా, జపాన్, మంగోలు, కాకస పర్వత భాషలు మాట్లాడేవారు కాశ్యపిలో ఉండేవారని రాంభట్ల జనకథలో అంటారు. 

అందుకే ఈ మూడు రకాల భాషల్లోనూ కొన్ని సామాన్య పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, భూమిని అరబ్బులు అర్దున్ అంటారు. జెర్మన్లు ఎర్దీ అంటారు. ఇంగ్లీష్ వారు ఎర్త్ అంటారు. వేదభాష రజ అంది. 

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2013/12/26/%E0%B0%AF%E0%B1%82%E0%B0%B0%E0%B0%AA%E0%B1%81-%E0%B0%B5%E0%B0%B0%E0%B0%95%E0%B1%82-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B1%87/ లో చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)

Wednesday, December 18, 2013

యయాతి కథ ఈ దేశంలో జరిగినది కాదా?!

 నహుషుడు అనే మాట మ్లేచ్ఛభాషాపదమని , వేదకాలపు ఆయగార్లు వ్యాసంలో రాంభట్ల గారు అంటారు. ఇంకా చెప్పాలంటే అది సుమేరు పదం. సుమేరు భాషలో  ఆ మాటకు అజగరం’, అంటే కొండచిలువ అని అర్థం. నహుషుడు, యయాతి అనే పేర్లే కాక; యయాతి కొడుకుల పేర్లు కూడా (యదు,తుర్వసు, అను, దృహ్యు, పురు) వారు సుమేరులు కావచ్చునని సూచిస్తాయని రాంభట్ల అంటారు. ఆ రకంగా చూస్తే; యతి, సంయాతి, ఆయాతి, అయతి అనే యయాతి సోదరుల పేర్లే కాక; పురూరవుని పేరు కూడా అలాంటిదే అనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా గమనించాను. ఈ రాజుల పేర్లు కొత్తగా ధ్వనించినా, వారి భార్యల పేర్లు కొత్తగా కనిపించకపోవడం. ఉదాహరణకు, నహుషుని భార్య ప్రియంవద. యయాతి భార్యలు దేవయాని, శర్మిష్ట; పురూరవుని ప్రేయసి ఊర్వశి. ఇందులోని మర్మ మేమిటన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న.

దీనినిబట్టి తేలుతున్న దేమిటంటే, వేదభాషకు మ్లేచ్ఛభాష అయిన సుమేరుతో సంబంధం ఉండడమే కాక; వైదికార్యులకు సుమేరు ప్రాంతమైన పశ్చిమాసియాతో సంబంధం ఉంది. పశ్చిమాసియా ఉత్తర ప్రాంతంలో, అంటే నేటి టర్కీలో పురాణ ప్రసిద్ధులు, క్షత్రియులు అయిన కుశులు, మైతాణులు(మితానీలు), భృగులు రాజ్యాలను స్థాపించి పశుపాలనను, వ్యవసాయాన్ని సమన్వయపరిచారని రాంభట్ల అంటారు 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/18/%E0%B0%AF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8/ లో చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)

Thursday, December 12, 2013

'రాక్షసులు' ఎవరు"!

రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం. మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా తీసే సినిమాల పుణ్యమా అని  రాక్షసుల గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!

వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి మీద  అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా మారిపోయాయి. అప్రాచ్యులు అనే మాటనే తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు. అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.

(పూర్తివ్యాసం‘http://magazine.saarangabooks.com/2013/12/11/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81/లో చదవండి. మీ స్పందన సారంగలోనే నమోదు చేయండి)

Wednesday, December 4, 2013

యయాతి కథ: సమాధానం దొరకని ప్రశ్నలు మరికొన్ని...

యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి నేటి సంప్రదాయ పండితులనుంచి సమాధానం దొరకదని కిందటిసారి చెప్పుకున్నాం. అటువంటివే ఈ కథలో మరో మూడు ఉన్నాయి...

మొదటిది, యయాతికి శుక్రుడు ఇచ్చిన శాపం. శర్మిష్టతో సంబంధం పెట్టుకోవద్దన్న తన ఆదేశాన్ని యయాతి ఉల్లంఘించాడు కనుక, అతనికి అకాల వృద్ధాప్యం విధించి శుక్రుడు శిక్షించాడని అనుకుంటాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, శుక్రుని శాపం యయాతికి ఏవిధంగానూ శిక్ష కాలేదు. అతడు యవ్వన సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాతే సహజగతిలో వృద్ధుడయ్యాడు. శాపాలనే నమ్మవలసివస్తే, నిజంగా శిక్ష అనుభవించింది, అతని వృద్ధాప్యాన్ని మోసిన అతని కొడుకుల్లో ఒకడు. యయాతికి ఎలాంటి శిక్షా లేకపోగా మొదటినుంచి చివరివరకూ ప్రతీదీ అతనికి అనుకూలించాయి.  తను తొలిచూపులోనే శర్మిష్ట పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమెను కోరుకున్నాడు. ఆమెను పొందాడు. ఆమెతో సంతానం కన్నాడు. చివరికి ఆమెకు కలిగిన పూరునే తన రాజ్యానికి వారసుని చేశాడు. ఈవిధంగా అన్నీ అతని ప్రణాళిక ప్రకారం, లేదా అతనికి అనుకూలించే ప్రణాళిక ప్రకారమే జరిగాయి.

దేవయాని కథ ఇందుకు భిన్నం. ఆమెకు దాదాపు అన్నీ ప్రతికూలంగానే జరిగాయి. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2013/12/04/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE/ లో చదవండి)

Wednesday, November 27, 2013

పెద్దమనిషి అయిన మనవరాలి గురించి శల్యుడి భయాలు

ఎస్. ఎల్. భైరప్ప రాసిన పర్వ నవల ఋతుకాల భయాలతో ప్రారంభమవుతుంది. 

మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ  భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు. కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ , స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ కొడుకు సమాధానం చెబుతాడు.


భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది. అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే అవకాశం! చివరికి అదే జరుగుతుంది. 

Friday, November 22, 2013

"నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ భర్తవే"

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది.

 సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు అంది. 

పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు. 

ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.


Wednesday, November 13, 2013

పెళ్లి ఒకరితో...ప్రేమ ఒకరిపై...

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న అతిశయ రూప లావణ్య సుందరి అయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. 

అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు అంది.  

Thursday, November 7, 2013

"నువ్వు కట్టి విడిచిన చీర నేను కట్టుకోవాలా?"

 కచుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ట అనేకమంది కన్యలను వెంటబెట్టుకుని దేవయానితో కలసి వనవిహారానికి వెళ్లింది. అంతా తమ చీరలు గట్టున పెట్టి ఓ సరస్సులో జలక్రీడలాడారు. అంతలో పెద్ద సుడిగాలి వీచింది. చీరలన్నీ కలసిపోయాయి. గట్టు మీదికి వచ్చి చీర కట్టుకునే తొందరలో శర్మిష్ట పొరపాటున దేవయాని చీర కట్టుకుంది.

 దాంతో దేవయాని మండిపడింది. లోకోత్తర చరిత్ర కలిగిన శుక్రుని కూతుర్ని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన  బ్రాహ్మణకులంలో పుట్టినదానిని, ఇప్పుడు నువ్వు కట్టి విడిచిన మైల చీర నేను కట్టుకోవాలా?’ అంది.

ఆ మాటకు అహం దెబ్బతిన్న శర్మిష్ట దేవయానిని నిందించి ఓ నూతిలోకి తోసి వెళ్లిపోయింది. 

కథనంలో కవి ఎన్ని మెళకువలు చూపాడో చూడండి...దేవయాని-శర్మిష్టల వైరానికి తక్షణ కారణం, శర్మిష్ట కట్టి విడిచిన చీర దేవయాని కట్టుకోవలసి రావడం. నువ్వు కట్టిన మైల చీర నేను కట్టుకోవాలా అని శర్మిష్టను దేవయాని నిలదీయడంలో కులాహంకారం పడగవిప్పి బుసకొట్టింది.  భవిష్యత్తులో దానికి ఆమె ప్రతిఫలం చెల్లించుకోవలసి వచ్చింది. నీ మైల చీర నేను కట్టుకోవాలా అని ప్రశ్నించిన దేవయానే ముందు ముందు తను కట్టుకున్న పురుషుని శర్మిష్టతో కలసి పంచుకోబోతోంది. అంటే, శర్మిష్ట ఎంగిలి చేసినదాన్నే తనూ అనుభవించబోతోందన్నమాట.

అలాగే శర్మిష్ట కూడా...

ప్రకృతి సమవర్తి. అతి ఎక్కడున్నా సహించదు. ఎక్కడో ఒక చోట సమతూకాన్ని స్థాపించితీరుతుంది. 

(పూర్తివ్యాసం http://www.saarangabooks.com/magazine/2013/11/07/%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%80%E0%B0%B0/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)

Wednesday, October 30, 2013

దేవయానిని కచుడు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?

రక్తసంబంధాలనూ; ప్రేమ, కరుణ, కడుపుతీపి, వాత్సల్యం వంటి మానవీయ సహజాతాలనూ కాలరాసే బానిసత్వపు కర్కశరూపాన్ని మన దాశరథి రంగాచార్యగారు కూడా చిల్లర దేవుళ్ళు నవలలో కళ్ళకు కట్టిస్తారు. అందులో రామారెడ్డి అనే దొరకు మంజరి అధికారిక సంతానమైతే, వనజ అడబాపకు కలిగిన సంతానం. అంటే, గర్భదాసి. రామారెడ్డి మంజరినే తన కూతురుగా భావిస్తాడు. ఆమె మీదే ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వనజను అడబాపగానే ఉంచుతూ గడీకి వచ్చిన అతిథులకు అప్పగిస్తూ ఉంటాడు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాలలో; ఇటీవలి అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు. అందుకు భౌగోళిక కారణాలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని కొశాంబీ తదితరులు అంటారు. అయితే, మన దేశంలో దాస, దాసీ వ్యవస్థ ఉంది. పుట్టింటి అరణంగానో, విజేతలైన రాజులకు కప్పంగానో, కానుకగానో; పండిత సత్కారంగానో దాస,దాసీలను ఇవ్వడం మన పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇలాంటి దాస,దాసీలు కలిగిన గృహ ఆర్థికవ్యవస్థ మన దేశంలో ఎలా అవతరించి అభివృద్ధి చెందిందో రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో ఆసక్తికరంగా వివరించారు. గృహ ఆర్థికవ్యవస్థలోని యజమానికీ, బానిసల యజమానికీ పోలికలు ఉంటాయి.

 ప్రస్తుతానికి వస్తే, తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా అని అతనికి గుర్తుచేయబోతోంది.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Wednesday, October 23, 2013

స్త్రీకి సొంత గొంతు లేదని చెప్పే గొప్ప కథ...The Lady

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి  స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, విలువ మారదు.  

స్త్రీకి తనదైన భాష లేదు. పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్...ఆ కథ పేరు, The Lady.

 స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో ఉందని నేను అనుకోను. ఆ కథ ఇదీ:

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Tuesday, October 22, 2013

మంత్రులు ఎక్ ష్ట్రా పాత్రలు వేయడం బాగుంటుందా?!

ఎప్పుడైనా బాగుంటుందేమో కానీ ఎప్పుడూ బాగుండదని నాకు అనిపిస్తుంది.

బాగుండకపోగా రోత పుడుతుంది, ఈ మంత్రులు మరీ ఇంత insensitive ఏమిటి, వీళ్ళ వల్ల జనానికి ఏం మేలు జరుగుతుందనిపిస్తుంది.

కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ నే తీసుకోండి. ఇటు రాజకీయాలను, అటు క్రికెట్ రాజకీయాలను ఆయన చాలాకాలంగా సవ్యసాచిలా నిర్వహిస్తున్నారు. రాజకీయనాయకులకు క్రికెట్ వ్యవహారాలమీద ఇంత ఆసక్తి ఎందుకన్నది ఓ జవాబు లేని ప్రశ్న. కాసులు కురిపించే ఆట కావడం ఆ ఆసక్తికి కారణమో, లేక ఆట మీద ఇష్టం కారణమో తెలియదు. ఆట మీద ఇష్టముంటే ఎప్పుడైనా ముఖ్యమైన మ్యాచ్ లకు వెళ్ళి చూసి ఆనందించ వచ్చు. క్రికెట్ బోర్డు నాయకత్వం దేనికి? రాజకీయనాయకులు చేయడానికి అంతకన్నా ముఖ్యమైన పనులు ఎన్ని లేవు?

శరద్ పవార్ నే అనుకోనక్కరలేదు. క్రికెట్ కిరీటాలపై మోజు పడే వారు  చాలా పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ శుక్లా,  బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ, అనురాగ్ ఠాకూర్,  నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా తదితరులు...

ఒక పక్క ఉల్లి పాయల ధర కిలో వందరూపాయలు దాటిపోయిందని వార్తలు హోరెత్తుతున్నాయి. ఆ వార్తల మధ్యలోనే మన వ్యవసాయమంత్రి గారికి సంబంధించిన ఓ క్రికెట్ వార్త! ముంబైలో ఒక ఆటమైదానానికి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టడానికి ఆయన నాయకత్వంలోని ముంబై క్రికెట్ బోర్డ్ నిర్ణయించిందట. ఉల్లి ధరల ఘాటుతో ఒళ్ళు మండి పోతున్న జనానికి వ్యవసాయమంత్రి క్రీడా వార్తలు చూసినప్పుడు ఎలా ఉంటుంది? సచిన్ పేరు పెట్టడం గురించిన ఆ వార్తను మరొకరి చేత ప్రకటింపజేయచ్చు కదా! జనం ఏమనుకుంటారన్న వెరపుకు నాయకులు పూర్తిగా నీళ్ళు వదిలేశారు.

నాలుగేళ్లుగా ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార-వ్యవసాయమంత్రిగా ఉన్న శరద్ పవార్ గారు తన మీద విమర్శల వడగళ్ళు పడుతున్నాసరే క్రికెట్ ను వదలకుండా వార్తల కెక్కుతూనే ఉన్నారు. చివరికి విమర్శలకు విసిగిపోయి వ్యవసాయశాఖను మాత్రమే తను ఉంచుకుని ఆహార శాఖను వదిలేశారు కానీ, క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టలేదు.

ఆయనకోసం ప్రత్యేకంగా క్రికెట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఆయన ఎంత సంతోషిస్తారో! ప్రధానికి ఆ ఆలోచన ఎందుకు రాలేదో! 

Wednesday, October 16, 2013

మహాభారతంలో హింసావాదులు, అహింసావాదులు


మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Monday, October 14, 2013

తుపాను వదిలేసింది, తొక్కిసలాట చంపేసింది!

ఈ దేశం ఎంత చిత్ర విచిత్ర దేశమో చూడండి!

పద్నాలుగేళ్ల తర్వాత అత్యంత తీవ్రమైన తుపాను ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ లను భయపెట్టింది.

వెనకటి అనుభవాల దృష్ట్యా ప్రాణనష్టం విపరీతంగా ఉండచ్చని దేశమంతా ఆందోళన చెందింది.

టీవీ చానెళ్లు రోజంతా మిగతా వార్తలను పక్కన పెట్టేశాయి.

తుపాను గమనాన్ని దాదాపు ప్రత్యక్షప్రసారం స్థాయిలో చూపించాయి.

దేశమంతా ఊపిరి బిగపట్టుకుని ఆ ప్రసారాన్ని చూసింది.

కానీ...

కనీస ప్రాణనష్టంతో తుపాను గండం నుంచి దేశం బయటపడింది.

జనం తేలికపడి ఊపిరి పీల్చుకున్నారు.

ఎంతో సమన్వయంతో పనిచేసిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను మనసులోనే అభినందించుకున్నారు.

ఇంకోవైపు చూడండి...

మధ్యప్రదేశ్ లో ఒక దేవాలయానికి వెళ్ళే మార్గంలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డారు.

తుపానును ఎదుర్కోవడంలో కనబరచిన తెలివీ, దక్షతా  తొక్కిసలాటను ఎదుర్కోవడంలో ఏమైపోయాయో తెలియదు.

అంతమంది జనం చీమల్లానో దోమల్లానో చనిపోవడానికి ఎందుకు అవకాశమిచ్చారో తెలియదు.

తరచు సంభవించే ఇలాంటి తొక్కిసలాటలను కూడా ఒక విపత్తుగా ఎందుకు గుర్తించలేదో తెలియదు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన సంస్థ పరిధిలోకి వీటిని కూడా ఎందుకు చేర్చలేదో తెలియదు.

గుంపుల నియంత్రణలో మన ప్రభుత్వాలు, పోలీసుల చేతకానితనాన్ని ఒక సమస్యగా గుర్తించి దానిని పరిష్కరించే ఆలోచనలు ఎందుకు చేయడంలేదో తెలియదు.

ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచనా, చర్యలూ ప్రారంభిస్తారన్న హామీ లేదు.

ప్రకృతి వల్లనే కాక మనుషులవల్ల కూడా విపత్తులు సంభవిస్తాయన్న సంగతిని గుర్తించని ప్రభుత్వాల బుర్రలు ఉండవలసిన చోటే ఉన్నాయా, మోకాల్లో ఉన్నాయా?!

Wednesday, October 9, 2013

ఇప్పటికీ పాటిస్తున్న భీష్ముడి రాజనీతి

 పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే. 

 ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, పౌరాజానపద పరిషత్తు’.  ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాదు. కొన్ని అధికారాలను పౌరాజానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
  

మెట్రో రైలులో మొయిలీ ప్రయాణం

పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ పెట్రోలు పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు(9-10-13) తన కార్యాలయానికి మెట్రో రైలులో వెళ్లారు. ఆయన వెంట సిబ్బందీ, సెక్యూరిటీ, మీడియా కూడా ఉన్నారు.

ఓ మంత్రి ఇలా మందిని వెంటబెట్టుకుని రైల్లో వెళ్ళడం ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది అవదా, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదా, లాంఛనప్రాయం కాదా అని కొన్ని వార్తా చానెళ్లు ప్రశ్నిస్తున్నాయి. ఓ చానెల్ వీక్షకుల స్పందన కోరింది. వీక్షకులు కూడా దీనిని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. నిజంగా పొదుపు చర్యలు తీసుకోవాలనే అనుకుంటే ఇంతకన్నా మంచి మార్గాలే ఉన్నాయన్నారు. దేశం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ప్రజలే పెట్రోల్ వాడకం మానేస్తారని, మంత్రి ప్రత్యేకంగా పొదుపు తత్వాన్ని బోధించనక్కరలేదని ఒక వ్యాఖ్యాత అన్నారు.

కొన్ని రోజుల క్రితం మొయిలీ ఇదే విధంగా పొడుపును ప్రతిపాదించారు. అప్పుడు కూడా మీడియా, కొన్ని రాజకీయపక్షాలు ఎద్దేవా చేశాయి.

నిజమే, రాజకీయనాయకుల చిత్తశుద్ధినీ, పబ్లిసిటీ యావనూ ప్రశ్నించవలసిందే. పొదుపు చేయడానికి ఇంతకన్నా మెరుగైన మార్గాలూ ఉన్నమాట కూడా నిజమే. మంత్రులు చేయవలసింది చేయకుండా ఇలా జిమ్మిక్కులతో జనాన్ని మోసం చేస్తున్నారన్న అభిప్రాయంలో నిజం ఉండదనీ చెప్పలేం. నాయకులలో ఉన్న సవాలక్ష లోపాలను ఎత్తి చూపి కడిగేయండి, తప్పులేదు. దాంతోపాటే, మెట్రో రైలు వాడకాన్ని ప్రోత్సహించే మంత్రి చర్యపై పాజిటివ్ గా స్పందించ నవసరమూ లేదా?

throwing the baby with bath water అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ నీ తోసిపుచ్చడం సరైనదేనా?

పౌరరవాణా వ్యవస్థలపై ఆధారపడాలనీ, కార్ పూలింగ్ వంటి పద్ధతులను పాటించాలనీ, వ్యక్తిగత మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే మాట చాలాకాలంగా వినిపిస్తున్నదే. ముందు ముందు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించాల్సి వస్తుంది. పౌరరవాణా సదుపాయాలను తగినంతగా అభివృద్ధి చేయలేదన్న విమర్శ మన ప్రభుత్వాలమీదా ఉంది. హైదరాబాద్ లాంటి నగరాలలో మెట్రో రైలు వల్ల కలిగే లాభాలలో  ప్రైవేట్ వాహనాల వినియోగమూ తద్వారా  కాలుష్యం తగ్గడం వంటివి కూడా ఉంటాయని మనకు తెలిసినదే.

ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు అత్యవసర వస్తువులు మినహా ఇతర వస్తువుల కొనుగోలును కొన్ని రోజులపాటు విరమించడం కూడా ధరల పెరుగుదలపై ఒక నిరసన ప్రకటన లేదా ధరలను కిందికి దింపే ఒక మార్గం కాబోదా?


Wednesday, October 2, 2013

మహాభారతంలో కుల, ప్రాంత నింద

కర్ణుడు : నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది. మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు. ఈ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద. 

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా...వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…        

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో  'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)                                                                        

Friday, September 27, 2013

'నెగిటివ్' వోటు ఒక పాజిటివ్ పరిణామం

వోటర్ల కోణం నుంచి చెప్పుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పును బట్టి, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు ఆ విషయాన్ని వోటరు బ్యాలెట్ పేపర్ మీద నమోదు చేయచ్చు. అంటే none of the above అనే ఆప్షన్ ఇకముందు బ్యాలెట్ పేపర్ మీద ఉంటుందన్నమాట. దీనినే నెగిటివ్ ఓటు అని కూడా అనచ్చు.

పార్లమెంట్ లో ఏ బిల్లు మీద అయినా లేదా ఏ తీర్మానం మీద అయినా ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు వోటింగ్ కు గైరు హాజరయ్యే హక్కు సభ్యులకు ఉంది. అలాంటి హక్కు వోటర్లకు మాత్రం ఎందుకు ఉండకూడదనే అభిప్రాయం ఈ తీర్పు సందర్భంలో వ్యక్తమైంది. అందులో న్యాయం ఉంది.

ఉన్నత, మధ్యతరగతి వర్గాలు; ముఖ్యంగా నగరాలు, మహానగరాలలో ఉన్నవాళ్ళు వోటు వేయరనీ, వారిలో పౌరస్పృహ లోపించిందనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దానికి సాధారణంగా బాధ్యతారాహిత్యం, బద్ధకం వంటి కారణాలను ఆపాదించడమూ చూస్తుంటాం. ఇలాంటి కారణాలతో వోటు వేయనివారు ఉండరని కాదు. వీరితోపాటు, ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థీ నచ్చక వోటు వేయని వారూ ఉంటారన్న సంగతి ఈ చర్చలో ఫోకస్ కావడం లేదు. దీంతో ఓటు వేయడాన్ని నిర్బంధం చేయాలనే నినాదం రాజకీయపక్షాలనుంచి,రాజకీయేతరవర్గాలనుంచీ చాలాకాలంగా గట్టిగా వినిపిస్తోంది.

సుప్రీం కోర్టు తాజా తీర్పు ఈ చర్చలోని ఏకపక్షధోరణిని, అసమగ్రతను ఎత్తి చూపేలా ఉంది. ఏ అభ్యర్థీ, ఏ పార్టీ నచ్చకపోయినా సరే పౌరస్పృహ పేరుతో మొక్కుబడిగానైనా వోటు వేయాలనడంలో అర్థం లేదు. ఆ మొక్కుబడి లక్షణం ప్రజాస్వామ్యానికి ఎలాంటి మేలూ చేయదు. వోటింగ్ లో వోటర్లు అందరూ చైతన్యంతో పాల్గొన్నప్పుడే ఎన్నికలు అర్థవంతమవుతాయి. తిరస్కార వోటు కూడా వోటే. అది కూడా వోటరు choice ను సూచించేదే. దానికి ఉండే ప్రయోజనాలు, అది నేర్పే రాజకీయపాఠాలూ దానికీ ఉంటాయి. అభ్యర్థులను నిలబెట్టడంలో రాజకీయపక్షాలు ఇక మీద జాగ్రత్త పడతాయి. ఎన్నికలప్రక్రియ దీనివల్ల ఎంతోకొంత ప్రక్షాళనమవుతుంది.

నిజానికి తిరస్కార వోటుకు ఎప్పుడో అవకాశం కల్పించి ఉండవలసింది. ఇప్పటికైనా సుప్రీం కోర్టు ద్వారా అది జరుగుతున్నందుకు సంతోషించాలి. అయితే, సుప్రీం కోర్టు తీర్పులను తిరగదోడే పనికీ రాజకీయపక్షాలు పూనుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీ భేదాలకు తావులేని అపూర్వ సయోధ్య రాజకీయపక్షాలలో వ్యక్తమవుతోంది. కనుక తాజా తీర్పు అమలుకు పార్లమెంటు ద్వారా అవి చక్రం అడ్డేయడానికి ప్రయత్నిస్తే ఆశ్చర్యం లేదు.

 ఎన్నికల సంస్కరణలను కానీ మరో సంస్కరణను కానీ రాజకీయనాయకత్వాల నుంచి ఆశించలేమనీ, ఏ సంస్కరణ జరగాలన్నా సుప్రీం కోర్టు కొరడా అందుకోవలసిందేననీ తాజా తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది.

ఈ తీర్పు అమలులో కొన్ని ప్రశ్నలు లేదా సమస్యలు ఎదురయ్యే మాట నిజమే. ఉదాహరణకు. తిరస్కార వోటు అభ్యర్థులు తెచ్చుకున్న వొట్ల శాతం కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించాల్సి రావచ్చు. సమస్యలు ఉంటే ఉండచ్చు, కానీ తిరస్కార వోటు వోటర్ల పక్షాన జరిగే ప్రజాస్వామిక న్యాయం. ప్రస్తుతం ఉన్న వోటింగ్ పద్ధతిలో వోటర్లు పోషిస్తున్నది passive పాత్ర మాత్రమే. అంటే ఉన్న అభ్యర్థులలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం మాత్రమే. తాజా తీర్పు అమలు జరిగితే వోటర్లు active పాత్రలోకి మారతారు. తమ తీర్పుకు మూడో కోణం ఉందని చెబుతారు. తిరస్కార వోటు కూడా వోటే నన్న సంగతిని మరచిపోకూడదు. 

Wednesday, September 25, 2013

మన వివాహసంబంధాలు- గాంధారి పెళ్లి


మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ. రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.  

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)

Thursday, September 19, 2013

సమైక్య సెంటిమెంట్ ఉందని నేతలకు తెలియలేదట! ఎందుకు తెలియలేదో అడిగారా?

విభజనా, సమైక్యమా అనేది కాసేపు అలా ఉంచుదాం...

నాకు కొన్ని రోజులుగా ఒకటే ఆశ్చర్యం కలిగిస్తోంది.

సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న సెంటిమెంట్ ఇంత బలంగా ఉన్నట్టు మాకు తెలియదని చాలామంది ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులు అనడం గమనించే ఉంటారు.

 "తొందరపడ్డామేమోననీ, సీమాంధ్ర అంచనాలో పొరపాటు చేశామనీ" సోనియా గాంధీ రాజకీయ సలహాదారు  అహ్మద్ పటేల్ అన్నట్టు తాజాగా వార్త వచ్చింది.

సీమాంధ్రలో సమైక్యానికి అనుకూలంగా బలమైన సెంటిమెంట్ ఉందని మంత్రులు సహా ప్రజాప్రతినిధులకు ఎందుకు తెలియలేదు? వాళ్ళు జనంలో లేరా? జనంతో కనెక్ట్ అయి లేరా? తమ తమ నియోజకవర్గాలలో జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోడానికి ఈ పదమూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి కూడా ప్రయత్నించ లేదా? కనీసం, తెలంగాణకు అనుకూలంగా 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకోడానికి వీరు ప్రయత్నించలేదా?

వారిని ఈ ప్రశ్నలు అడిగినవారు ఎవరూ కనిపించలేదు.

2004 ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, తద్వారా తెలంగాణ ఇస్తామన్న ఆశలు ఆ ప్రాంతం వారిలో ఎప్పుడైతే రేకెత్తించిందో, రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగం లో ఎప్పుడైతే తెలంగాణ ప్రస్తావన చేశారో అప్పుడే తెలంగాణ తథ్యమన్న సంకేతాలు వెళ్లిపోయాయి. కాకపోతే ఎంత కాలానికి అనేదే అప్పటికి మిగిలిన ప్రశ్న.

పోనీ, ఆ సంకేతాలను అప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోలేక పోయారనుకుందాం. 2009లో చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా అర్థం చేసుకోవాలి కదా! ఎన్నికల రాజకీయంలో భాగంగా టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అంతమాత్రాన తెలంగాణ ఇచ్చేస్తారేమిటి అని మామూలు జనం అనుకోవచ్చు, రాజకీయనాయకులు అనుకోగలరా? వాళ్ళకు political instinct లేదా రాజకీయ ఇంగితం, లేదా దూరదృష్టి ఉండద్దా?

వారిని ఈ ప్రశ్నలు అడిగినవారూ కనిపించలేదు.

నాయకుల్లో పైన చెప్పిన లక్షణాలు ఉండి ఉంటే, వాళ్ళు జనంలో ఉండి ఉంటే;  తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా సమైక్య ఉద్యమాన్ని అప్పుడే  నిర్మించి ఉండేవారు. హైదరాబాద్ లో ఎంజీవోలు పెట్టిన సభల్లాంటివి సీమాంధ్రప్రాంతాలలోనూ పెట్టి ఉండేవారు.

ఇలా అనడంలో ఉద్దేశం, తెలంగాణాను ఇవ్వద్దనో, లేదా ఇవ్వమనో చెప్పడం కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాలలోని మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవలసిందే. ఇప్పటి సమైక్య ఆందోళన ముందునుంచీ ఉండి ఉంటే అదొక balancing factor గా ఉపయోగపడి కేంద్రం అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే దిశగా స్పష్టమైన ఆలోచనలు చేసి ఉండేది. ఊహించలేకపోయామంటూ సీమాంధ్ర నాయకులు తప్పించుకోజూడడం సరైన excuse అవుతుందా?!

తొందరపడ్డామనీ, అంచనా వేయలేకపోయామనీ అహ్మద్ పటేల్ అనవలసిన పరిస్థితి అసలెందుకు వచ్చింది? దానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి.  సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి తగిన feed back కేంద్రానికి అంది ఉండకపోవాలి. లేదా అందినా కేంద్రం దానిని పట్టించుకోకపోయి ఉండాలి. జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులే అంటున్నారు కనుక మొదటి కారణమే నిజమై ఉండాలి.

                                                                     ***
నాకీ సందర్భంలో ఒకటి గుర్తొస్తోంది.
అరవైదశకం చివరి మాట. అప్పటికి నేనింకా విద్యార్థిగా ఉన్నాను. ప్రపంచ తెలుగు సభలో, రచయితల సభలో జరుగుతున్నాయి, నాకు గుర్తు లేదు. కానీ ఒక సన్నివేశం మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ కళ్ళముందు కదులుతోంది, వేదిక మీద ముఖ్యమంత్రి సహా మంత్రులు పలువురు ఉన్నారు. కపిల కాశీపతి అనే ఓ సీనియర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయనాయకుల మీద నిప్పులు చెరుగుతున్నారు. అది ఎంతవరకు వెళ్లిందంటే, "అవాకులు చెవాకులు పేలే రాజకీయ నాయకుడిని నోరుముయ్యి(ఒక తిట్టు పదం వాడారు)అంటూ చొక్కా పుచ్చుకుని కిందికి ఈడ్చితే తప్ప ఈ రాజకీయాలు బాగుపడవు" అన్నారాయన. ముఖ్యమంత్రి ఉన్న సభలో ఆయన అలా మాట్లాడడం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసెసింది. అందుకే ఆ ఘటన గుర్తుండిపోయింది.

పాత్రికేయులు పద్ధతిగా ఉన్నారా అన్నది వేరే ప్రశ్న. ఉండేవారు ఉన్నారు, లేని వారు లేరు. అలాగే రాజకీయనాయకులూ...

నా ప్రశ్న ఏమిటంటే, జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదు, ఊహించలేదన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను "అయితే మీరు జనంలో లేరా, జనంతో కనెక్ట్ అయి లేరా?" అని ఏ ఒక్కడూ ఎందుకు అడగలేదు???


సముద్రతీరం వెంబడి నరసాపురం నుంచి మచిలీపట్నానికి...

 నే నోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  నేటి రైలు, రోడ్డుమార్గాలలో సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను. 

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)



Wednesday, September 11, 2013

చలికాలంలో ఓ వెచ్చని సాయంత్రం...

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు.

 నిజానికి బాపన్నగూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. 

అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి పరిచయాలు ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి.

 ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు...

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను సారంగలో పోస్ట్ చేయండి)

మళ్ళీ మతకల్లోలాల 'ఉపాధి హామీ పథకం'?!

అప్పుడు 1992. ఇప్పుడు 2013.
మధ్యలో 21 సంవత్సరాలు!

1992కు ముందు కూడా దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది.
ఇప్పుడూ ఆర్థిక సంక్షోభంలో ఉంది.

అప్పుడు మతకల్లోలాలు దేశాన్ని అట్టుడికించాయి.
ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ పరిణామాలు ఆ దుర్దినాలను గుర్తుచేస్తున్నాయి

ఒక్క యూపీలోనే కాదు, ఇంకా అనేక రాష్ట్రాలలో
మతకల్లోల వాతావరణం ఉందని హోమ్ మంత్రి సెలవిస్తున్నారు.

 చరిత్ర ఎందుకిలా పునరావృతమవుతోంది?

ఆర్థిక సంక్షోభానికీ, మతకల్లోలాలకూ మధ్య
కనిపించని ముడి ఏమైనా ఉందా?!

ఆర్థిక సంక్షోభంనుంచి పుట్టుకొచ్చిన నిరుద్యోగుల సేన
ఇన్నేళ్ల విరామం తర్వాత
రాజకీయనాయకులకు వాటంగా అందివచ్చిందా?
మతకల్లోలాల రూపంలో 'ఉపాధి హామీ పథకం'
అమలు జరుగుతోందా?!

ప్రతి ఒకరూ కరువును ప్రేమిస్తారని
ఎవరో అన్నారు
అలాగే ప్రతి రాజకీయ నాయకుడూ
ఆర్థిక సంక్షోభాన్ని ప్రేమిస్తాడనే వాక్యాన్ని
దానికి జోడించుకోవాలా?!

మతకల్లోల కాలం తర్వాత అడుగుపెట్టిన
అభివృద్ధి కాలంలో జ్ఞాననేత్రం విప్పుకున్న
నేటి యువత ఇప్పటి పరిణామానికి
ఎలా స్పందిస్తుంది?

ఆ స్పందనలోనే దేశ భవిష్యత్తుకు
భరోసా ఉంది.

                             ***

ఇంకో ఆశ్చర్యం...

గతంలో మతకల్లోలాలప్పుడు
మతాల పేర్లు చెప్పకుండా
రెండు వర్గాల మధ్య ఘర్షణగా పేర్కొంటూ
మీడియా జాగ్రత్త, బాధ్యత పాటించేది

ఇన్నేళ్లలో అది కూడా
తన ప్రవర్తనా నియమావళిని
మరచిపోయినట్టుంది
మతాల పేర్లు పేర్కొని మరీ
కల్లోలాన్ని కవర్ చేస్తోంది.

ఏమైంది ఈ దేశానికి?
ఎటు వెడుతోంది?







Wednesday, September 4, 2013

అమ్రీష్ పురి, ఓం పురి ల వంశం ఏమిటి?

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పూరుడిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ. వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది. 

అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అని కోశాంబి అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున పురి అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్చిన్నతను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. 

ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ lo నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)

Friday, August 30, 2013

ఆశారామ్-శ్రీశ్రీ రవిశంకర్-జనం...ఎవరు నేరస్థులు?

ఇంతకీ ఎవరు నేరస్థుడు?!

మైనర్ బాలికను చెరిచాడని
ఆరోపణ ఎదుర్కొంటున్న
ఆశారామ్ అనే తెల్లగడ్డం మనిషా
లేక...

ఈ జనం క్షమామూర్తులు,
తప్పు ఒప్పుకుంటే క్షమించేస్తారు
అన్నశ్రీ శ్రీ  రవిశంకర్ అనే
ఆ నల్ల గడ్డం మనిషా?

నేరం రుజువయ్యేవరకూ
ఎవరూ నేరస్థుడు కాదు కనుక
ఆశారామ్ ప్రస్తుతానికి
నేరస్థుడు కాకపోవచ్చు

కానీ ఈ వెర్రి జనం మీద
విపరీతమైన నమ్మకంతో'
క్షమించేస్తారులే అన్న శ్రీశ్రీ రవిశంకర్
నా ఉద్దేశంలో
ఎటువంటి దర్యాప్తూ, విచారణా
అవసరం లేకుండానే
తేల్చి చెప్పగలిగిన
నేరస్థుడు!

ఆయన్ను కూడా అనుకోవడం
దేనికి లెండి
ఈ జనాల మధ్య 'జీవించే కళ'ను(art of living)
 ఔపోసన పట్టిన ఆ వ్యక్తి
అలాంటి సలహా ఇవ్వడంలో
ఆశ్చర్యం ఏముంది?

ఆశారామ్ కు ఇప్పటికే
రెండు కోట్ల మంది
భక్తులు ఉన్నారట
ఈ ఉదంతంతో
ఆ సంఖ్య నాలుగు కోట్లకు పెరగచ్చు

అసలు నేరస్తులు ఎవరో
ప్రత్యేకంగా చెప్పాలా?!


Thursday, August 29, 2013

'పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి సరి!'

వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు...
                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం,  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ఆత్మశాంతిపర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

 (పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను పై మ్యాగజైన్ లో పోస్ట్ చేయండి)

Wednesday, August 21, 2013

దేవదాసు సినిమాలో ఆ సన్నివేశం...

శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు శరత్. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు.  శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం...దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు  పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)

Tuesday, August 20, 2013

పరువు పోయింది...ఫైళ్లూ పోతున్నాయి!

ఇంతకాలం
వేల కోట్ల రూపాయిల
ప్రజాధనం
అవినీతి బకాసురునికి
ఆహారం
అయిపోతోందనుకున్నాం

ఇంతకాలం
దేశం పరువు
అంతర్జాతీయస్థాయిలో
గల్లంతయిపోతోందనుకున్నాం

తీరా దొంగలు
పట్టుబడే దశకు వచ్చేసరికి
ఫైళ్లే పోతున్నాయి!

అన్ని రకాలుగా
సిగ్గు విడిచేసిన
ఈ రాజకీయవ్యవస్థ
ఒంటి మీద
పోవడానికి ఒక్క
నూలు పోగైనా మిగిలిందా?!



Wednesday, August 14, 2013

గాంధీజీ హత్యను ఎందుకు ఆపలేకపోయారు?

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

 ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలం లో చదవండి. మీ స్పందనను దయచేసి సారంగ మేగజైన్ లో పోస్ట్ చేయండి)


Saturday, August 10, 2013

ఇదే మీడియా అప్పుడు నవాజ్ షరీఫ్ ను హీరోను చేసింది!

ఒక్కసారి మూడు నెలలు వెనక్కి వెళ్ళి చూడండి...

భారతీయ మీడియా పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలను మనదేశంలో జరుగుతున్న ఎన్నికలా అన్నట్టుగా పూనకం పట్టినట్టు కవర్ చేసింది. నవాజ్ షరీఫ్ విజయాన్ని చెబుతూ హిందూ దినపత్రిక Lion of Punjab roars in Pak అని శీర్షిక ఇచ్చింది.  కాబోయే ప్రధానమంత్రిగా ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రతి ఇంగ్లీష్ న్యూస్ చానెల్ పోటీ పడ్డాయి. నవాజ్ షరీఫ్ ప్రధాని అయితే ఆ వైపునుంచి ఉగ్రవాదానికి ప్రోత్సాహం తగ్గిపోతుందనీ, భారత్-పాక్ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించాయి. ఇంగ్లిష్ న్యూస్ చానెళ్ల శ్రుతిమించిన పాకిస్తాన్ fixation ఎప్పుడూ ఆశ్చర్యం  కలిగిస్తూనే  ఉంటుంది.

మూడు నెలల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోందో చూడండి...

పాక్ సైన్యమూ, ఉగ్రవాదులూ దాడిచేసి అయిదుగురు భారత సైనికులను వధించారు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నట్టు తాజా సమాచారం.  జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే నినాదం జనంలోంచి వినిపిస్తోంది. పాక్ దుర్మార్గానికి దీటైన జవాబు ఎలా చెప్పాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. పాకిస్తాన్ తో మాటలు కొనసాగించాలా వద్దా అన్న చర్చ మరోసారి తెర మీదికి వచ్చి ఏకాభిప్రాయానికి దూరంగా అదే పనిగా ఊదరగొడుతోంది. నవాజ్ షరీఫ్ ను గొప్ప ఆశాకిరణంగా మూడు నెలల క్రితం చూపించడానికి ప్రయత్నించిన ఇదే మీడియాలో ఇప్పుడు ఆయన భారతవిద్వేష గతం చర్చకు వస్తోంది. కిందటిసారి ఆయన ప్రధాని అయిన వెంటనే చైనాను సందర్శించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏవో నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్న విషయం ప్రస్తావనకు వస్తోంది. సైన్యం మద్దతుతోనే ఆయన మొన్నటి ఎన్నికలలో విజయం సాధించాడు కనుక ఉగ్రవాదచర్యల్లో స్వయంగా భాగస్వామి అయిన సైన్యాన్ని ఆయన అదుపు చేయలేడన్న విమర్సా వినిపిస్తోంది.

మొత్తానికి  మీడియా ఆశాకిరణంగా చూపించడానికి ప్రయత్నించిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు విలన్ గా పైకి తేలాడు.

ఆశాభావం తప్పు కాదు కానీ,  అందుకు కూడా కొంతకాలం ఓపిక పట్టి ఓ అభిప్రాయానికి రావడంలోనే విజ్ఞత, వివేకం ఉంటాయి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం మంచిది కాదు. అందులోనూ జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మీడియాలో అటువంటి ధోరణి అసలే మంచిది కాదు.  సున్నితమైన అంశాలలో విధాన రూపకల్పనలో మీడియాకు కూడా కొంత పరోక్ష భాగస్వామ్యం, బాధ్యత ఉంటాయి. జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలది కావడమే అందుకు కారణం.

పాక్ ఎన్నికలపై మీడియా అత్యుత్సాహాన్ని ప్రశ్నిస్తూ 5/13/13 న 'రెండు ఆశ్చర్యాలు-ఒక ఆవేదన' అనే శీర్షికతో ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు జరుగుతున్నది దానికి ధృవీకరణే. 

Wednesday, August 7, 2013

అశ్వత్థామను చూసిన మనిషి

మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Thursday, August 1, 2013

రేపటి తీరాంధ్ర అభివృద్ధి ఎలా? ఈ వ్యాసం చదవండి

రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. అది వివిధ ప్రాంతాలలో కలిగించే సంతాప, సంతోషాలు కొంతకాలం కొనసాగడం సహజమే. ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టే మాట నిజమే. అయితే, తర్వాత అయినా భవిష్యత్ కార్యాచరణ మీద అన్ని ప్రాంతాలూ దృష్టి పెట్టక తప్పదు. ఈ నిర్ణయం నుంచి వీలైనన్ని సానుకూల ఫలితాలను పిండుకోడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. ఆ మేరకు రాజకీయనాయకత్వంలో సరికొత్త విజ్ఞత, బాధ్యత అంకురిస్తాయని ఆశించాలి. 

ఈ సందర్భంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి కొత్త బ్లూ ప్రింట్ అందించి రాజకీయనాయకత్వానికి సహకరించవలసిన నూతన బాధ్యత తెలుగు మేధావులపై ఉంది. అలా నిగ్గు తేలిన బ్లూ ప్రింట్ అమలుకు రాజకీయనాయకత్వంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. 

అభివృద్ధి అంశాలపై ఎంతో కాలంగా రాస్తున్న అరుదైన తెలుగు మేధావులలో జాన్సన్ చోరగుడి ఒకరు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తీరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చర్చిస్తూ 2010లో ఆయన 'సాక్షి' దినపత్రికలో ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం రాశారు. ఆ వ్యాసం లింకు కింద ఇస్తున్నాను. 




Wednesday, July 31, 2013

ఎవరు ఈ 'నరుడు'?

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?
                                                          -శ్రీశ్రీ
                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)
ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన సామాన్యుడు ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి నరుడు అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన నరుడు ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “...కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)