Thursday, August 20, 2015

పనామా సీతాకోకచిలుకలు పావురాలంత!

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:
పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.
(పూర్తి రచన 'అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం...' అనే శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/08/20/%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A1%E0%B1%88%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5-%E0%B0%85%E0%B0%A8/ లో  చదవండి)

No comments:

Post a Comment