Saturday, January 9, 2016

వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం!

తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి.
వరుణదేవుడికి సమయాసమయాలు తెలియవు. ఎన్నికలు వచ్చిపడుతున్న సమయంలో చెన్నైని కనీవినీ ఎరగని వర్షాల్లో ముంచెత్తి జయలలిత ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించాడు. ప్రభుత్వం వైఫల్యం జాతీయ స్థాయిలో సైతం మోతెక్కి పోయింది. అయినాసరే  చచ్చినాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా బాధితులకిచ్చే అన్నం పొట్లాల మీద అమ్మ సొంత బొమ్మ వేయించుకుని వరదకన్నీట తడిసిన జనం బతుకుల్ని పిండి వోట్ల చుక్కలు రాల్చుకోవాలని చూసింది.
ఇంకా వరద శోకం నుంచి రాష్ట్రం తేరుకొనే లేదు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అనేముంది; ఎన్నికల వరదనుంచి గట్టెక్కడానికి ఏ గడ్డి అయినా కరవడానికి అన్ని పార్టీలు, ప్రభుత్వాలు సర్వదా సిద్ధమే. జయలలిత ప్రభుత్వం తాజాగా జనానికి జల్లికట్టు వినోదం అందించడం అనే ఓ కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టి కేంద్రాన్ని ఒప్పించింది. ఎన్నికల ఏరు దాటడానికి  జయలలిత చేయి అందిస్తుందని కాబోలు మోడీ ప్రభుత్వం జల్లికట్టు వినోదానికి అడ్డుకట్ట తొలగించి ఎడ్లతోనూ, దున్నపోతులతోనూ ఇంచక్కా ఆడుకుని వినోదిస్తూ వరద దుఃఖం మరచిపొండని తమిళ జనానికి సందేశించింది.
ఈ పార్టీలకు, ప్రభుత్వాలకు సిగ్గు లేదు. జనానికి దిక్కు లేదు!!!

No comments:

Post a Comment