Friday, October 21, 2016

ఇంత బేషరంగా ఎలా ఫిరాయిస్తారబ్బా?!

తమ మధ్య ఎలాంటి కీచులాటలు ఉన్నా పాతికేళ్లో, పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి  మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ ఉన్నారు.

అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో పార్టీవ్రత్యానికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.  అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.

19 comments:

  1. భాస్కరం గారికి,
    మీరు సారంగలో విశ్వనాథ గురించిన వ్యాసాలపై స్పందనగా హరిబాబుగారు తన బ్లాగులో ఈ వ్యాస వ్రాసారు. నాకున్న ఆసక్తి కొద్దీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఆ పత్రికలో ఇది ప్రచురించలేదు గనక మీ బ్లాగులో సంప్రదిస్తున్నాను.
    ....శ్రీనివాసుడు


    Haribabu Suranenii16 November 2016 at 23:14

    కల్లూరి భాస్కరం గారికి,
    విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించి ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకపోవటానికి ఆయనలోని కరుడుగట్టిన మతచాందసవాదం ఒక్కటే కారణం అని తీర్మానించెయ్యడం ఎట్లా కుదురుతుంది?నవయుగ వైతాళికుడు అని పిలిపించుకున్న గురజాడ అప్పారావు గారు ఇంగ్లీషువాళ్ళ సహాయంతో మతచాందసాన్ని తుదముట్టించుకుని బాగుపడాలే తప్ప ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకూడదు అని స్వాతంత్ర్యోద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినారు కదా!

    ఆనాటి వాతావరణంలో మనము ప్రత్యక్షంగా లేనప్పుడు అప్పటివారి జ్ఞాపకాలని రిఫరెన్సులుగా తీసుకోవడం తప్ప మరోదారి లేదు,అవునా?ఎలాగూ స్వర్గం/నరకం నుంచి వచ్చి జవాబు చెప్పుకోలేరు గాబట్టి మన పాండిత్యాన్ని ఉపయోగించుకుని నిన్నటి వారిమీద తొందరపడి తీర్పులు ఇస్తే రేపు మనం స్వర్గం/నరకం నుంచి రాలేని స్థితికి వెళ్ళాక ముందు తరంవారు వారి పాండిత్యం ఉపయోగించుకుని మనమీద తీర్పులు ఇస్తే మనమూ జవాబు చెప్పుకోలేము కదా!

    Openion1: బ్రిటిష్ ప్రభుభక్తి పైనే కాంగ్రెస్ కట్టడానికి మొదట పునాదులు పడ్డాయి.అదే మొదట్నించి కాంగ్రెస్ మూలసూత్రంగా వస్తున్నది.బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగే ఎట్టి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ ఒక్కనాటికీ ఆమోదించి ఉండలేదు.

    బ్రిటిష్ పరిపాలన ఇండియా ప్రజల బాగుకొరకే అని నేనిప్పటికీ విశ్వసిస్తున్నాను.మునుపు పోగొట్టుకున్న వైభవవిశేషములను తిరిగి సంపాదించుకొనడానికి ఈ పరిపాలన ప్రసాదించబడినదని తలుస్తున్నాను.కనుకనే దేశీయులంతా దేశశ్రేయానికి తోడ్పడే ఈ పరిపాలన పట్ల భక్తివిశ్వాసాలు కలిగిఉండటం తమ దేశంపట్ల తమవిధిని నిర్వర్తించడంగా తలంచుకోవాలని భావిస్తున్నాను.
    -1809:పండిత మాలవ్యా

    Openion2: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్

    Openion3: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్

    Openion4: Note one particular instance of
    gurajaaDa's intolerence on the patriots of the day and how he chose to threaten them in one of his
    English poems:

    “Lives of moderates all remind us

    We should wisely keep from crime

    Open sedition only finds us

    Shelter in a far off clime

    Let us then line up and speaking

    Speaking at a furious rate

    Not always some benefit seeking

    Learn to be loyal and to wait. “

    Even now, we will be living under the British, had we taken this masterpiece of advice
    Seriously.

    ReplyDelete
  2. నాకు రూఢిగా తెలిసిన రెండు వాస్తవాలు: గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న దాదాభాయి నౌరోజి "Poverty and un-British Rule in India" అనే పుస్తకం రాసింది 1901లో. జలియన్ వాలా బాగ్ దురంతం జరిగింది 1919 ఏప్రిల్ 13న.

    ఈ రెండు వాస్తవాలూ అప్పటి కాలపు వాస్తవికమైన సామాజిక స్థితిని అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. నౌరోజీ గారు చాలా విశ్లేషణాత్మకంగా మొత్తం ఆరు కారణాలతో ఆర్ధికపరమైన పరిజ్ఞానం గలవాళ్ళకి చదవగానే ఇంగ్లీషువాళ్ళు మన దేశపు ఆర్ధికవ్యవస్థ మీద ఎలా దాడి చేశారో సోదాహరణంగా వివరిస్తుంది.అయినా అప్పటి మేధావులాలో చాలామంది ఇంగ్లీషువాళ్ళని మంచివాళ్ళు అనే అన్నారు.మాలవ్యాని ఇక్కడ ముందే కరుడు అగ్ట్టిన హిందూమతతత్వవాది కింద జమకట్టేశారు,అయినపటికీ అబద్ధీకుడు మాత్రం కాదని నేను నమ్ముతున్నాను.మీరు నమ్మకపోతే అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పైన ఉదహరించిన వ్యక్తుల్లో ఎవరికీ భవిష్యత్తులో ఎజెండాల కోసం తమ పులుముడు పాండిత్యంతో వెనకటి తరాల వారికి లేని దురుద్దేశాలు అంటగట్టేవారు తమను బద్నాం చెయ్యడానికి తమ మాటల్ని వాడుకుంటారేమో అనే భయాలు లేవు - అప్పటికింకా టైం మెషీన్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. కాబట్టి తమ కళ్ళముందు తాము చూస్తున్న వాస్తవికమైన స్థితి గురించి నిర్భయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు అవి.ఇంకా వెనక్కి వెళ్తే 18వ శతాబ్దంలో కాశీయాత్ర చరిత్ర అనే యాత్రాస్మృతి గ్రంధం ద్వారా ప్రముఖులైన ఏనుగుల వీర్స్వామయ్య గారు కూడా ఆంగ్లేయుల సత్యనిరతి గురించి,ధర్మదృష్తి గురించి గురజాడ అప్పారావు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నారు.

    నౌరోజీ గారి పుస్తకం వీరిలో ఎవరూ చదవకపోవడానికి ఆస్కారం ఉంది.కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పబ్లిష్ అయిందని తెలిసినా ఇవ్వాళ్టి తరంలో ఎంతమంది దాన్ని చదివారు?అంటే,నౌరోజీ గారి ఆర్ధికశాస్త్ర విశ్లేషణ పట్టించుకోకపోతే అప్పటివారిలోనే చాలామందికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన న్యాయబద్ధమైనదిగానే కనిపించిన స్థితిలో ఒక్క విశ్వనాధయే కాక ఇంకా చాలామంది పోరాటానికి దూరంగా ఉండి ఉంటారు కదా!

    అంటే,ఇంగ్లీషువారి పరిపాలనా కాలంలోని అన్ని దశలలోనూ చాలామంది మేధావులు ఇంగ్లీషువాళ్లని చాలా మంచివాళ్ళని విపరీతంగా పొగిడేశారు.అలాంటప్పుడు కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వకుండా విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించకపోవడానికి పూర్తిగా ఆయనలోని మతచాందసవాద సంస్కృతియే కారణం అని ఎట్లా తీర్పు ఇవ్వగలిగారు?


    అప్పటి మేధావులేం ఖర్మ?స్వాతంత్ర్యం వచ్చాక గవర్నమెంటు వారు మన స్కూళ్ళలో రాసి చదివంచిన చరిత్ర పాఠాలు చదివి మా అమ్మాయే నన్ను అడిగింది "ఇంత మంచివాళ్ళ మీద అంత భీకరంగా పోరాడాల్సిన అవసరం యేంటి నాన్నా?" అని!మన చరిత్రని మనం అంత న్యాయంగా రాసుకుని అఘోరించాం,మీరేమో ఆ తక్కిరిబిక్కిరి చరిత్రనే ప్రామాణికంగా తీసుకుని అసలు పట్టుకోవాల్సిన సత్యాలను పట్టించుకోకుండా ఏమాత్రం పట్టించుకోనక్కర లేని విషయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు.

    Statement1.లజపతి రాయ్, మాలవీయ హిందూ మహాసభతోనూ, కాంగ్రెస్ తోనూ కూడా అసోసియేట్ అయినవాళ్ళు. గాంధీతో కలసి పనిచేయడానికి వీళ్ళకు మొదట్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాంగ్రెస్ కు ఉన్న ఒక ప్లాట్ ఫామ్ స్వభావం రీత్యా (ఆ స్వభావాన్ని గాంధీయే తీసుకొచ్చారా లేక దానికి ముందు నుంచీ ఉందా అన్నది ఇంకో పరిశీలనార్హమైన ప్రశ్న) గాంధీ హిందూవాదులతోనే కాక, సోషలిష్టులతోనూ, కమ్యూనిష్టులతోనూ కూడా పని చేశారు. వారితో ఒక ఈక్వేషన్ స్థాపించుకోగలిగారు.

    Analysis: గాంధీ 1914 వరకు దక్షిణాఫ్రికా లోనే ఉన్నాడు.దక్షిణాఫ్రికా నుంచి 1915లో భారతదేశంలోకి అడుగుపెట్టాడు.1906లో తిలక్ హిందూమహాసభ పెట్టినా తర్వాత అందులో పనిచేస్తున్నా తన కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు,పార్టీ సమావేశాల్లో పాల్గొంటూనే ఉండేవాడు.ఆనాతివారిలో దాదాపు అందరూ బహుళ సభ్యత్వాన్ని కలిగిఉండటం కాంగ్రెసు పార్టీ తొలినాళ్ళనుంచీ ఉన్నదే.అయినా మీరు బ్రాకెట్లో ఇప్పుడు పరిశీలించాలని అటున్నారు.కొంచెం కష్తపడితే సంవత్సరాలు,నెలలు,తేదీలతో సహా దొరికే సమాచారాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తెలుసుకోకుండా వాస్తవమైన చరిత్ర గురించి "ఏమో!" ,"కాబోలు!","బహుశా!" లాంటి మాటలు వాడటం శాస్త్రీయమైన విశ్లేషణ ఎంతమాత్రం కాదు!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. 2.గాంధీ ఛాందసవాద హైందవశక్తులతో జరిపిన పోరాటం మరో ఘట్టం. ఈ శక్తులనుంచి ఆయనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.

    Analysis: గాంధీని చంపడం అనేది విభజన తర్వాత జరిగిన హిందూ ముస్లిం అల్లర్ల సమయంలో హిందువులు నష్తపోవడాన్ని చూసి చేసినట్టు గాడ్సే గురించిన పరిశోధకులు అందరూ తేల్చి చెప్పిన వాస్తవం. రాజకీయంగా గాంధీ ప్రో పాకిస్తాన్ వాదనలు చేశాడు ఇండియన్లదే,ముఖ్యంగా హిందువులదే తప్పన్నట్టు మాట్లాడేవాడు.ఇండియా పాకిస్తానుకి నష్టపరిహారం ఇవ్వాలని అన్నట్టూ ఇప్పించినట్టూ గుర్తు. గాంధీ చాతుర్వర్ణం గురించి హైందవేతరులు విమర్శిస్తుంటే "అబ్బెబ్బే, చాతుర్వర్ణం మంచిదే - ప్రతి వ్యక్తిలోనూ ఆ నాలుగూ ఉంటాయి,ఒక లక్షణం ఎక్కువ ఉండొచ్చు, అంతే!" అని సమర్ధించాడు. అణిచివేత/పెత్తనం ప్రాతిపదికన ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి ఒప్పుకున్న గాంధీ హరిజనుల మరియు ఇతర దళితుల దగ్గిరకి వచ్చేసరికి నన్ను చంపినా ఒప్పుకోనన్నాడు,ఎందుకని?భగత్సింగ్ మార్త్గాన్ని వ్యతిరేకించింది కేవలం అందులో ఉన్న హింసని చూసి కాదు,కమ్యునిష్టు సిద్ధాంతం పట్ల వ్యతిరేకత వల్ల.గాంధీ వేసిన ప్రతి అడుగూ మాట్లాడిన ప్రతి మాటా హిందూమతానికి విశ్వసనీయతని కలిగించి ఇతరులతో హిందూత్వానికి ఆమోదముద్ర వేయించుకోవడం కోసమే చేశాడు - అది వాస్తవం! అంబేద్కర్ చాలా స్పష్టంగా మిగిలిన అందరికన్నా గాందీయే ఎక్కువ హిందూమతత్వవాది అని అప్పుడే ప్రకటించేసిన ఇన్నేళ్లకి ఇప్పుడు మీరు గాంధీ హిందూమతత్వవాదం మీద పోరాడాడనీ,అందుకే మతత్వవాదులు గాంధీని చంపేశారనీ అంటున్నారు - నాకు మొదటిసారి మీమీద చాలా జాలివేస్తున్నది ఈ సూత్రీకరణ చదివాక!1925లో పార్టీగా అవిర్భవించిన నాటినుచీ గతితార్కిక చారిత్రక భౌతికవాదులు గాంధీ ఆదర్శవాదం ముసుగులో ఉన్న చాతుర్వర్ణ ప్రేమికుడు అంటూ గడిపి డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ కొత్తగా గాంధీ హైందవశక్తులతో పోరాడాడు అనటం,ఇవ్వాళ్టి హిందువులకి నీతులు చెప్పడానికి గాంధీ సూక్తుల్ని వాడటం విచిత్రంగా ఉంది!

    3.ఆ తర్వాత యాంటీ-నెహ్రూయిజం(గాంధీ-నెహ్రూ)వేళ్ళు ఎక్కడ ఏయే వర్గాలలో ఉన్నాయో, అందుకు కారణాలేమిటో అర్థమవుతుంది. ఈ యాంటీ-గాంధీ, నెహ్రూ శక్తులే ఆర్ ఎస్ ఎస్, బీజేపీలకు కోర్ బేస్ గా మారడంలో ఆశ్చర్యం ఏమీలేదు.

    Analysis: అప్పుడెప్పుడో క్విట్ ఇండియా ఉద్యమం రోజుల్లో గాంధీ మీద గూఢచర్యం చెయ్యటం దగ్గిర్నుంచి పార్టీ పెట్టిన తదాదిగా కమ్యూనిష్టులు నిన్నమొన్నటివరకూ గాంధీవాదం ఒక వెరిబాగుల సిద్ధానతం అని వెక్కిరించ్గటం అది ఫెయిల్ అయిపోతుంది,అయిపోయింది అని అనటం సంగతి యేంటి? మరో చారిత్రక తప్పిదపు అధ్యాయం మొదలవుతున్నదా!

    P.S:మూడు కాలాలలోనూ మారనిదే సత్యము, అన్ని వర్గాలూ తేలిగ్గా అర్ధం చేసుకుని పాటించగలిగినదే ధర్మము,ఒకే రకమైన నేరము చేసిన అందరికీ తారతమ్యాలు చూడకుండా శిక్ష వెయ్యడమే న్యాయము. ఈ మూడింటినీ సమాజం అనుసరించాలంటే మొదట వాటి గురించి చెప్పేవారు ఉండాలి. చెప్పేవారిలో వీటిపట్ల క్లారిటీ ఉండాలి.దురదృష్టవశాత్తూ మీ వ్యాసంలో వాటిలో ఏ ఒక్కటీ లేదు.ఏ ప్రతిపాదనకీ వాస్తవమైన సాక్ష్యాలు లేవు,కాబట్టి సత్యం లేదు.విశ్వనాధ లోని మత చాందసవాదం,గాంధీమార్గాన్ని అనుసరించకపోవటం అనే సంబంధం లేని విషయాలని సంబంధం ఉన్నట్టు నిరూపించాలనుకోవడం వల్ల ధర్మం లేదు.ముందువెనకలు చూసుకోకుండా విశ్వనాద మీద ఇచ్చేసిన ఏకపక్షపు తీర్పు నవయుగవైతాళికుడికీ తగులుతుండటం వల్ల న్యాయం లేదు.

    ReplyDelete
  5. హరిబాబుగారూ...శ్రీనివాసు గారూ...
    మీ స్పందన ఆలస్యంగా చూశాను. 'సారంగ'లో వచ్చిన వ్యాసం కనుక మీరు అందులోనే స్పందిస్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. హరిబాబు గారి స్పందనలను కొన్నింటిని 'సారంగ' క్యారీ చేసింది.

    ReplyDelete
  6. భాస్కరం గారూ!
    స్పందనకు దన్యవాదాలు. మీకు అసౌకర్యం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. మీ వ్యాసంలో హరిబాబు గారి స్పందనలు ఆ పత్రిక ప్రచురించడం నిజమేగానీ ఈ స్పందన ప్రచురించలేదు. ఇదే కాదు, ఇంకా మేము పంపించిన కొన్ని వందల స్పందనలను కూడా ప్రచురించలేదు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. మనం కామెంట్ పోస్టు చేసినప్పుడు వాళ్ళకి ఆ వ్యాఖ్య నచ్చకపోతే "Your comment awaiting moderation" అని వస్తుంది. అంతేగాక, వాళ్ళు ఆరు నెలల క్రితమే నిష్కర్షగా ప్రకటించారు, "కామెంట్ ప్రచురించలేదూ అంటే మాకు నచ్చలేదనే అర్థం. దీని విషయమై ఉత్తర ప్రత్యుత్తరములకు తావులేదు", అని. కావాలంటే మీకు ఆ ప్రకటన లింకు ఇవ్వగలను. అది వారి స్వాయత్తాధికారానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో మనం మాట్లాడవలసినది ఏమీ వుండదు.
    కానీ, ఇక్కడ విషయం సారంగ కాదు. మీ వ్యాసానికి ఒక ప్రతిస్పందనను మీ దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నమే తప్పితే వేరొకటి కాదు. నా ఉద్దేశం, లక్ష్యం అంతవరకే.

    మప్పిదాలతో,
    శ్రీనివాసుడు.



    ReplyDelete


  7. బ్రేవో శ్రీనివాసులు గారు

    సారంగ ఏకపక్షాన్ని గురించి ఇట్లా అందరూ చెప్పడం మొదలెడితే గాని వారికి అవగాహస సరిగా రాదు

    చీర్స్

    జిలేబి

    ReplyDelete
  8. కల్లూరి భాస్కరం గారికి,
    విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించి ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకపోవటానికి ఆయనలోని కరుడుగట్టిన మతచాందసవాదం ఒక్కటే కారణం అని తీర్మానించెయ్యడం ఎట్లా కుదురుతుంది?నవయుగ వైతాళికుడు అని పిలిపించుకున్న గురజాడ అప్పారావు గారు ఇంగ్లీషువాళ్ళ సహాయంతో మతచాందసాన్ని తుదముట్టించుకుని బాగుపడాలే తప్ప ఇంగ్లీషువాళ్ళ మీద పోరాడకూడదు అని స్వాతంత్ర్యోద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినారు కదా!

    ఆనాటి వాతావరణంలో మనము ప్రత్యక్షంగా లేనప్పుడు అప్పటివారి జ్ఞాపకాలని రిఫరెన్సులుగా తీసుకోవడం తప్ప మరోదారి లేదు,అవునా?ఎలాగూ స్వర్గం/నరకం నుంచి వచ్చి జవాబు చెప్పుకోలేరు గాబట్టి మన పాండిత్యాన్ని ఉపయోగించుకుని నిన్నటి వారిమీద తొందరపడి తీర్పులు ఇస్తే రేపు మనం స్వర్గం/నరకం నుంచి రాలేని స్థితికి వెళ్ళాక ముందు తరంవారు వారి పాండిత్యం ఉపయోగించుకుని మనమీద తీర్పులు ఇస్తే మనమూ జవాబు చెప్పుకోలేము కదా!

    Openion1: బ్రిటిష్ ప్రభుభక్తి పైనే కాంగ్రెస్ కట్టడానికి మొదట పునాదులు పడ్డాయి.అదే మొదట్నించి కాంగ్రెస్ మూలసూత్రంగా వస్తున్నది.బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగే ఎట్టి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ ఒక్కనాటికీ ఆమోదించి ఉండలేదు.

    బ్రిటిష్ పరిపాలన ఇండియా ప్రజల బాగుకొరకే అని నేనిప్పటికీ విశ్వసిస్తున్నాను.మునుపు పోగొట్టుకున్న వైభవవిశేషములను తిరిగి సంపాదించుకొనడానికి ఈ పరిపాలన ప్రసాదించబడినదని తలుస్తున్నాను.కనుకనే దేశీయులంతా దేశశ్రేయానికి తోడ్పడే ఈ పరిపాలన పట్ల భక్తివిశ్వాసాలు కలిగిఉండటం తమ దేశంపట్ల తమవిధిని నిర్వర్తించడంగా తలంచుకోవాలని భావిస్తున్నాను.
    -1809:పండిత మాలవ్యా
    Openion2: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్
    Openion3: బ్రిటిష్ పరిపాలనలో సుగుణమేదైనా ఉన్నదంటే అది ఆయుదహబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతే,సందేహము లేదు.ప్రజల మానప్రాణధనాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వాల పరమధర్మం.నాగరికతా వాసన ఏమాత్రమున్నా ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంద్.బ్రిటిషువారు న్యాయపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు కాబట్టి నాలుగుకాలాలపాటు ఇండియాప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు,కాగలుగుతున్నారు.
    -1916:బాబు అంబికాచరణ్ మజుందార్
    TO BE CONTINUED

    ReplyDelete
  9. CONTINUEING FROM ABOVE
    Openion4: Note one particular instance of
    gurajaaDa's intolerence on the patriots of the day and how he chose to threaten them in one of his
    English poems:

    “Lives of moderates all remind us

    We should wisely keep from crime

    Open sedition only finds us

    Shelter in a far off clime

    Let us then line up and speaking

    Speaking at a furious rate

    Not always some benefit seeking

    Learn to be loyal and to wait. “

    Even now, we will be living under the British, had we taken this masterpiece of advice
    Seriously.

    నాకు రూఢిగా తెలిసిన రెండు వాస్తవాలు: గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న దాదాభాయి నౌరోజి "Poverty and un-British Rule in India" అనే పుస్తకం రాసింది 1901లో. జలియన్ వాలా బాగ్ దురంతం జరిగింది 1919 ఏప్రిల్ 13న.
    ఈ రెండు వాస్తవాలూ అప్పటి కాలపు వాస్తవికమైన సామాజిక స్థితిని అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. నౌరోజీ గారు చాలా విశ్లేషణాత్మకంగా మొత్తం ఆరు కారణాలతో ఆర్ధికపరమైన పరిజ్ఞానం గలవాళ్ళకి చదవగానే ఇంగ్లీషువాళ్ళు మన దేశపు ఆర్ధికవ్యవస్థ మీద ఎలా దాడి చేశారో సోదాహరణంగా వివరిస్తుంది.అయినా అప్పటి మేధావులాలో చాలామంది ఇంగ్లీషువాళ్ళని మంచివాళ్ళు అనే అన్నారు.మాలవ్యాని ఇక్కడ ముందే కరుడు అగ్ట్టిన హిందూమతతత్వవాది కింద జమకట్టేశారు,అయినపటికీ అబద్ధీకుడు మాత్రం కాదని నేను నమ్ముతున్నాను.మీరు నమ్మకపోతే అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పైన ఉదహరించిన వ్యక్తుల్లో ఎవరికీ భవిష్యత్తులో ఎజెండాల కోసం తమ పులుముడు పాండిత్యంతో వెనకటి తరాల వారికి లేని దురుద్దేశాలు అంటగట్టేవారు తమను బద్నాం చెయ్యడానికి తమ మాటల్ని వాడుకుంటారేమో అనే భయాలు లేవు - అప్పటికింకా టైం మెషీన్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. కాబట్టి తమ కళ్ళముందు తాము చూస్తున్న వాస్తవికమైన స్థితి గురించి నిర్భయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు అవి.ఇంకా వెనక్కి వెళ్తే 18వ శతాబ్దంలో కాశీయాత్ర చరిత్ర అనే యాత్రాస్మృతి గ్రంధం ద్వారా ప్రముఖులైన ఏనుగుల వీర్స్వామయ్య గారు కూడా ఆంగ్లేయుల సత్యనిరతి గురించి,ధర్మదృష్తి గురించి గురజాడ అప్పారావు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నారు.

    నౌరోజీ గారి పుస్తకం వీరిలో ఎవరూ చదవకపోవడానికి ఆస్కారం ఉంది.కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పబ్లిష్ అయిందని తెలిసినా ఇవ్వాళ్టి తరంలో ఎంతమంది దాన్ని చదివారు?అంటే,నౌరోజీ గారి ఆర్ధికశాస్త్ర విశ్లేషణ పట్టించుకోకపోతే అప్పటివారిలోనే చాలామందికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన న్యాయబద్ధమైనదిగానే కనిపించిన స్థితిలో ఒక్క విశ్వనాధయే కాక ఇంకా చాలామంది పోరాటానికి దూరంగా ఉండి ఉంటారు కదా!

    అంటే,ఇంగ్లీషువారి పరిపాలనా కాలంలోని అన్ని దశలలోనూ చాలామంది మేధావులు ఇంగ్లీషువాళ్లని చాలా మంచివాళ్ళని విపరీతంగా పొగిడేశారు.అలాంటప్పుడు కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వకుండా విశ్వనాధ సత్యనారాయణ గాంధీగారిని అనుసరించకపోవడానికి పూర్తిగా ఆయనలోని మతచాందసవాద సంస్కృతియే కారణం అని ఎట్లా తీర్పు ఇవ్వగలిగారు?

    అప్పటి మేధావులేం ఖర్మ?స్వాతంత్ర్యం వచ్చాక గవర్నమెంటు వారు మన స్కూళ్ళలో రాసి చదివంచిన చరిత్ర పాఠాలు చదివి మా అమ్మాయే నన్ను అడిగింది "ఇంత మంచివాళ్ళ మీద అంత భీకరంగా పోరాడాల్సిన అవసరం యేంటి నాన్నా?" అని!మన చరిత్రని మనం అంత న్యాయంగా రాసుకుని అఘోరించాం,మీరేమో ఆ తక్కిరిబిక్కిరి చరిత్రనే ప్రామాణికంగా తీసుకుని అసలు పట్టుకోవాల్సిన సత్యాలను పట్టించుకోకుండా ఏమాత్రం పట్టించుకోనక్కర లేని విషయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు.
    TO BE CONTINUED

    ReplyDelete
  10. CONTINUING FROM ABOVE
    Statement1.లజపతి రాయ్, మాలవీయ హిందూ మహాసభతోనూ, కాంగ్రెస్ తోనూ కూడా అసోసియేట్ అయినవాళ్ళు. గాంధీతో కలసి పనిచేయడానికి వీళ్ళకు మొదట్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాంగ్రెస్ కు ఉన్న ఒక ప్లాట్ ఫామ్ స్వభావం రీత్యా (ఆ స్వభావాన్ని గాంధీయే తీసుకొచ్చారా లేక దానికి ముందు నుంచీ ఉందా అన్నది ఇంకో పరిశీలనార్హమైన ప్రశ్న) గాంధీ హిందూవాదులతోనే కాక, సోషలిష్టులతోనూ, కమ్యూనిష్టులతోనూ కూడా పని చేశారు. వారితో ఒక ఈక్వేషన్ స్థాపించుకోగలిగారు.
    Analysis: గాంధీ 1914 వరకు దక్షిణాఫ్రికా లోనే ఉన్నాడు.దక్షిణాఫ్రికా నుంచి 1915లో భారతదేశంలోకి అడుగుపెట్టాడు.1906లో తిలక్ హిందూమహాసభ పెట్టినా తర్వాత అందులో పనిచేస్తున్నా తన కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు,పార్టీ సమావేశాల్లో పాల్గొంటూనే ఉండేవాడు.ఆనాతివారిలో దాదాపు అందరూ బహుళ సభ్యత్వాన్ని కలిగిఉండటం కాంగ్రెసు పార్టీ తొలినాళ్ళనుంచీ ఉన్నదే.అయినా మీరు బ్రాకెట్లో ఇప్పుడు పరిశీలించాలని అటున్నారు.కొంచెం కష్తపడితే సంవత్సరాలు,నెలలు,తేదీలతో సహా దొరికే సమాచారాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తెలుసుకోకుండా వాస్తవమైన చరిత్ర గురించి "ఏమో!" ,"కాబోలు!","బహుశా!" లాంటి మాటలు వాడటం శాస్త్రీయమైన విశ్లేషణ ఎంతమాత్రం కాదు,కహానీలు చెప్పడం అంటారు దాన్ని!
    2.గాంధీ ఛాందసవాద హైందవశక్తులతో జరిపిన పోరాటం మరో ఘట్టం. ఈ శక్తులనుంచి ఆయనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.
    Analysis: గాంధీని చంపడం అనేది విభజన తర్వాత జరిగిన హిందూ ముస్లిం అల్లర్ల సమయంలో హిందువులు నష్తపోవడాన్ని చూసి చేసినట్టు గాడ్సే గురించిన పరిశోధకులు అందరూ తేల్చి చెప్పిన వాస్తవం. రాజకీయంగా గాంధీ ప్రో పాకిస్తాన్ వాదనలు చేశాడు ఇండియన్లదే,ముఖ్యంగా హిందువులదే తప్పన్నట్టు మాట్లాడేవాడు.ఇండియా పాకిస్తానుకి నష్టపరిహారం ఇవ్వాలని అన్నట్టూ ఇప్పించినట్టూ గుర్తు. గాంధీ చాతుర్వర్ణం గురించి హైందవేతరులు విమర్శిస్తుంటే "అబ్బెబ్బే, చాతుర్వర్ణం మంచిదే - ప్రతి వ్యక్తిలోనూ ఆ నాలుగూ ఉంటాయి,ఒక లక్షణం ఎక్కువ ఉండొచ్చు, అంతే!" అని సమర్ధించాడు. అణిచివేత/పెత్తనం ప్రాతిపదికన ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి ఒప్పుకున్న గాంధీ హరిజనుల మరియు ఇతర దళితుల దగ్గిరకి వచ్చేసరికి నన్ను చంపినా ఒప్పుకోనన్నాడు,ఎందుకని?భగత్సింగ్ మార్త్గాన్ని వ్యతిరేకించింది కేవలం అందులో ఉన్న హింసని చూసి కాదు,కమ్యునిష్టు సిద్ధాంతం పట్ల వ్యతిరేకత వల్ల.గాంధీ వేసిన ప్రతి అడుగూ మాట్లాడిన ప్రతి మాటా హిందూమతానికి విశ్వసనీయతని కలిగించి ఇతరులతో హిందూత్వానికి ఆమోదముద్ర వేయించుకోవడం కోసమే చేశాడు - అది వాస్తవం! అంబేద్కర్ చాలా స్పష్టంగా మిగిలిన అందరికన్నా గాందీయే ఎక్కువ హిందూమతత్వవాది అని అప్పుడే ప్రకటించేసిన ఇన్నేళ్లకి ఇప్పుడు మీరు గాంధీ హిందూమతత్వవాదం మీద పోరాడాడనీ,అందుకే మతత్వవాదులు గాంధీని చంపేశారనీ అంటున్నారు - నాకు మొదటిసారి మీమీద చాలా జాలివేస్తున్నది ఈ సూత్రీకరణ చదివాక!1925లో పార్టీగా అవిర్భవించిన నాటినుచీ గతితార్కిక చారిత్రక భౌతికవాదులు గాంధీ ఆదర్శవాదం ముసుగులో ఉన్న చాతుర్వర్ణ ప్రేమికుడు అంటూ గడిపి డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ కొత్తగా గాంధీ హైందవశక్తులతో పోరాడాడు అనటం,ఇవ్వాళ్టి హిందువులకి నీతులు చెప్పడానికి గాంధీ సూక్తుల్ని వాడటం విచిత్రంగా ఉంది!
    3.ఆ తర్వాత యాంటీ-నెహ్రూయిజం(గాంధీ-నెహ్రూ)వేళ్ళు ఎక్కడ ఏయే వర్గాలలో ఉన్నాయో, అందుకు కారణాలేమిటో అర్థమవుతుంది. ఈ యాంటీ-గాంధీ, నెహ్రూ శక్తులే ఆర్ ఎస్ ఎస్, బీజేపీలకు కోర్ బేస్ గా మారడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
    Analysis: అప్పుడెప్పుడో క్విట్ ఇండియా ఉద్యమం రోజుల్లో గాంధీ మీద గూఢచర్యం చెయ్యటం దగ్గిర్నుంచి పార్టీ పెట్టిన తదాదిగా కమ్యూనిష్టులు నిన్నమొన్నటివరకూ గాంధీవాదం ఒక వెరిబాగుల సిద్ధానతం అని వెక్కిరించ్గటం అది ఫెయిల్ అయిపోతుంది,అయిపోయింది అని అనటం సంగతి యేంటి? మరో చారిత్రక తప్పిదపు అధ్యాయం మొదలవుతున్నదా!
    TO BE CONTINUED

    ReplyDelete
  11. CONTINUING FROM ABOVE
    P.S:మూడు కాలాలలోనూ మారనిదే సత్యము, అన్ని వర్గాలూ తేలిగ్గా అర్ధం చేసుకుని పాటించగలిగినదే ధర్మము,ఒకే రకమైన నేరము చేసిన అందరికీ తారతమ్యాలు చూడకుండా శిక్ష వెయ్యడమే న్యాయము. ఈ మూడింటినీ సమాజం అనుసరించాలంటే మొదట వాటి గురించి చెప్పేవారు ఉండాలి. చెప్పేవారిలో వీటిపట్ల క్లారిటీ ఉండాలి.దురదృష్టవశాత్తూ మీ వ్యాసంలో వాటిలో ఏ ఒక్కటీ లేదు.ఏ ప్రతిపాదనకీ వాస్తవమైన సాక్ష్యాలు లేవు,కాబట్టి సత్యం లేదు.విశ్వనాధ లోని మత చాందసవాదం,గాంధీమార్గాన్ని అనుసరించకపోవటం అనే సంబంధం లేని విషయాలని సంబంధం ఉన్నట్టు నిరూపించాలనుకోవడం వల్ల ధర్మం లేదు.ముందువెనకలు చూసుకోకుండా విశ్వనాద మీద ఇచ్చేసిన ఏకపక్షపు తీర్పు నవయుగవైతాళికుడికీ తగులుతుండటం వల్ల న్యాయం లేదు.

    మీలో పదిచోట్ల నుంచి విషయాలు సేకరించి ఒకచోట గుదిగుచ్చగలిగిన పాండిత్యం ఎక్కువగా ఉండి గందరగోళానికి తావివ్వని శాస్త్రీయమైన విశ్లేషణ చెయ్యడానికి అవసరమైన జ్ఞానం తక్కువగా ఉనట్టు అనిపిస్తుంది నాకు.ముందుముందు ఆ లోపాన్ని సవరించుకుని ఎల్లరను శాస్త్రీయమైన విశ్లేషణలతో అలరించగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. Mahatma Gandhi referred P C Joshi's letter to Bhulabhai Desai for an enquiry. Bhulabhai Desai reported in the light of cold documentary evidence how the Communist Party of India had functioned as a fifth Columnist, acting as a paid agent of the British Government in India

      Arun Shourie in his brilliant book: The Only Fatherland � Communists, "Quit India" and The Soviet Union has totally exposed the anti-national political activities of the Communist Party of India during the period of II World War from 1939-1945 and more particularly during the days of Quit India Movement in August 1942 and thereafter.

      http://www.ivarta.com/columns/OL_070311.htm

      Delete
  12. భాస్కరం గారూ,
    విశ్వనాథ గురించి మీరు వ్రాస్తున్న వ్యాసపరంపరకు సమాధానం అన్నట్లుగా అదే పత్రికలో "మన ఆధునికత ఒట్టి డొల్ల" అనే వ్యాసం వచ్చింది. ముస్లిం రాజుల పట్ల ఎడతెగని ఆరాధనాభావంతో, ఫానటిక్ గా రచయిత టిప్పుసుల్తాన్ ను మహామానవతావాదిగా చిత్రించాడు. చరిత్రను వక్రీకరించో లేదా ఏకపక్షంగానో వ్యాఖ్యానించేవారి తప్పుడు సమాచారాన్ని మీరు కూడా నమ్ముతారేమోనన్న భయంతో ఈ వివరాలిస్తున్నాను.

    అయితే, టిప్పు గురించి సాధికారికంగా అతడి ఆస్థాన ముస్లిం చరిత్రకారుడు వ్రాసిన చరిత్రలో టిప్పు స్వయంగా వ్రాసిన రెండు వేల లేఖలలో అతడెంత మతోన్మాదో, దురాక్రమణదారుడో తెలుసుకోవచ్చు.
    ఇంకా నేను సేకరించిన సమాచారం మీ నిమిత్తం ఇక్కడ అందజేస్తున్నాను. మీకు వీలుంటే చదవండి.
    ఆ ప్రతికలో ప్రచురిస్తారని ఇదే సమాచారాన్ని నా మిత్రుడు పంపాడు, కానీ, ప్రచురింపబడలేదు.
    JAMES SCURRV, WHO WAS DETAINED A PRISONER DURING TEN YEARS, IN THE DOMINIONS OF HYDER ALI and TIPPOO sultan.

    టిప్పు సుల్తాన్ దురాగతాలను ప్రతక్షంగా పదేళ్ళ పాటు బందీ వుండి అనుభవించిన సైనికుడి ప్రతక్ష కథనం
    (అతిశయోక్తులు లేని కేవల సత్యం)

    JAMES SCURRV, WHO WAS DETAINED A PRISONER DURING TEN YEARS, IN THE DOMINIONS OF HYDER ALI and TIPPOO sultan.

    https://ia802702.us.archive.org/29/items/captivitysufferi00scuruoft/captivitysufferi00scuruoft_bw.pdf




    సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన భారతీయ ముస్లిం ఎం. ఏ. ఖాన్ గారి ఈ పుస్తకం చదివండి.
    ఇస్లామిక్ జిహాద్ : బలవంతపు మతమార్పిళ్ళ ఘన చరిత్ర

    Islamic jihad A legacy of forced conversions
    by M. A. Khan

    http://guruprasad.net/wp-content/uploads/2016/03/islamic-jihad-legacy-of-forced-conversion-imperialism-slavery.pdf

    టిప్పు విగ్రహారాధకులను ఏ విధంగా కేరళలోని కూర్గు ప్రాంతంలో హింసించాడో అతడి ఆస్థాన చరిత్రకారుడైన మీర్ హుస్సేన్ కిర్మానీ మాటల్లోనే చెప్పాలంటే,
    Evidence of Tipu’s deeds in Coorg comes from within his own court. Tipu’s biographer and courtier Mir Hussein Kirmani wrote about Tipu’s exploits in Coorg in his The History of Tipu Sultan, "The conquering Sultan dispatched his Amirs and Khans with large bodies of troops to punish those idolaters and reduce the whole country (Coorg) to subjection. They attacked and destroyed many towns. Eight thousand men, women, and children were taken as prisoners. They were collected in an immense crowd like a flock of sheep or herd of bullocks."

    In a letter to the Nawab of Kurnool, Tipu claims he took 40,000 Coorgs as prisoners and forcibly converted them to Islam and incorporated them into his Ahmadi corps. Many of the descendants of Tipu’s converted Coorgs still retain their original Coorg family names.

    Tipu also went about destroying temples in Coorg. To protect the Omkareshwara temple in Mercara, residents of the town knocked down its towers and replaced them with domes. The temple retains the domes even today, striking testimony that has survived over the ages. According to the Mysore Gazetteer of the time, when Tipu was finally vanquished, only two temples in his kingdom performed daily pujas. The Gazetteer estimates that Tipu destroyed around eight thousand temples in South India.

    ReplyDelete
  13. టిప్పు కూర్గు ప్రాంతంలో జరిపిన దురాగతాలతో పోలిస్తే మలబార్ ప్రాంతంలో జరిపిన మారణకాండ ఇంకా ఘోరం,

    Portuguese missionary Father Bartholomew wrote in his book, Voyage to East Indies, “Women and children were hanged in Calicut, first mothers were hanged and their children tied to necks of mothers. That barbarian Tipu Sultan tied naked Christians and Hindus to the legs of elephants and made the elephants to move around till the bodies of the helpless victims were torn to pieces.” After the pillage of Calicut, Tipu wrote to his generals: “Almost all Hindus in Calicut are converted to Islam. Only on the borders of Cochin State a few are still not converted. I am determined to convert them also very soon. I consider this as Jihad to achieve that object.”

    ఇవే గాక ఫస్ట్ పోస్టులోని ఈ వ్యాసం కూడా చూడవచ్చు.

    http://www.firstpost.com/politics/why-the-coorg-are-upset-with-tipu-sultan-and-the-karnataka-governments-efforts-to-honour-him-2502144.html

    It's always about politics: Here's why Karnataka is raging over govt's plans to celebrate Tipu Sultan Jayanti

    మప్పిదాలతో,
    శ్రీనివాసుడు.


    ReplyDelete
    Replies
    1. @శ్రీనివాసుడు గారు,

      సుమారు ఐదారు నెలలనుంచి సారంగ శ్రద్దగా చూడటం లేదు. మీరిచ్చిన లింక్ ను చూశాను. గందర గోళ శర్మ రాశారు అని తెలియటంతో పైపైన చదివాను. పెద్దగా పట్టించుకోలేదు.

      మీకు ఆయన వ్యక్తిగతంగా కూడా తెలిసినట్లున్నారు. నాదోక ప్రశ్న ఆయన ప్రతి లైన్ కి వంద మందిని ఎందుకు కోట్ చేస్తారు? అసలికి ఆయన వ్యాసాలద్వార పాఠకులకి ఎమి చెప్పాలనుకొంట్టున్నారు? ఆయన దృష్టిలో పాకిస్థాన్,బంగ్లాదేశ్ ల లో నరకయాతన అనుభవించే హిందువులు కనపడరా? ఆయన చరిత్రను వక్రీకరించటానికి ఎందుకు అంత శ్రమిస్తున్నాడు?

      Delete
  14. అదొక వింతశైలి శ్రీరామ్ గారూ! తాను చెబుతున్న విషయాన్ని ఎవ్వరూ ప్రశ్నించకుండా వుండేందుకే ఆ ఉటంకింపులు. ఎప్పుడు, ఎవరు, ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఏ ప్రశ్నకు సమాధానంగా, ఏ విషయాన్ని గురించి చెబుతూ ఆ ఉటంకింపులు చేసారో మనకెక్కడా ఆ రచయిత చెప్సడు. అవి కేవలం తనకు విద్వేషం వున్న విషయాలను వ్యతిరేకిస్తే చాలు, లేదా తనకు దురభిమానమున్న విషయాన్ని సమర్థించేట్లుగా వుంటే చాలు, తనకు కావలసిన ఆ ముక్కని మాత్రమే, ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని మాత్రమే తీసుకుని ఇక వ్యాసంలో ప్రతిక్షేపించడమే. అక్కడో వాక్యం, ఇక్కడో పదం తీసుకువచ్చి వ్యాసం నిండా నింపడమే ఒక గొప్ప విశ్లేషణకి గీటురాయి అనుకునే తత్త్వం అది.
    విఛిత్రమేమంటే అతడు వ్రాసిన "గ్రహాంతరవాసి" అనే నవలలో అచ్చంగా ఇలాంటి ఉటంకింపులు చేసే పాత్రే వుంటుంది. దాని పేరు ’సర్వస్వం‘. ఆ ఉటంకింపులతోనే అతడి మెదడు నిండిపోయి సహజత్వాన్ని కోల్పోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాత్ర.
    అతడి స్వీయ చరిత్రగా చెప్పకున్న ’ది లాస్ట్ బ్రాహ్మిన్‘ చదవితే ఈ మానసిక వికృతికి కారణమేమిటో, అనువంశికమేమో మనకి తెలుస్తుంది.
    ఆ రచయితకు ఆధునికత అన్నా మరియు ఇప్పటి హిందూ(?) వాదమన్నా, కమ్యూనిస్టులన్నా, క్రైస్తవ మతం అన్నా, పాశ్చాత్య సంస్కృతి, శాస్త్రీయ ప్రగతి అన్నా తాత్త్వికంగా అతి తీవ్రమైన వ్యతిరేక భావన, ద్వేషం వున్నాయి. సనాతన ధర్మం గురించి తనకు పూర్తిగా అవగాహన వుందన్న తీవ్ర భ్రమా వుంది. ఉండవచ్చు, తప్పులేదు. కానీ, ఎదుటివారు చెబుతున్నది, సరైన ప్రతిపత్తులతో చూపించేది, తనకు తెలిసినదానికన్నా భిన్నమైన సమాచారం వీటిని వేటినీ పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకు పధ్నాలుగు కొమ్ములు అనే మనస్తత్త్వం వుండంటమే విషాదం.
    తార్కికంగా జరిపే చర్చకు దూరం, మరియు తాను చెప్పినదానికి ఆధారాలు ఎవ్వరూ అడగకూకడదు, అడిగినా చెప్పననే మూఢత్వం.
    "ఐసిస్ నేత అబూబకర్ అల్ బాగ్ధాదీ కూడా మతోన్మాది, క్రూరుడు కాడు, అతడిని అమెరికా సామ్రాజ్యవాదం తయారుచేసింది, ఇస్లాం చాలా శాంతియుతమైన మతం, మన దేశం ఎంతో శాంతిగా విలసిల్లడానికి కారణం ముస్లిం ప్రభువులు" అనే కరడుగట్టిన భావనలోనే కొట్టుకుపోయే మేధావి ఆ రచయిత.

    నాకు తెలిసినంతవరకూ కంచ ఐలయ్య శైలికి ఏకలవ్య శిష్యుడు ఆ రచయిత. దానినే మక్కీకి మక్కీ అవలంబించడం అతడి ప్రత్యేకత.

    ReplyDelete
    Replies
    1. ఆయన రాసిన పోస్ట్ లు చదవటమే సహనానికి పరీక్ష, మీరు గ్రహాంతరవాసి నవల చదవారంటే అన్నిటికన్నా పెద్ద విఛిత్రం :)

      Delete
  15. nice blog
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete
  16. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ReplyDelete