Thursday, March 13, 2014

గంధర్వుడి మాటల్లో గణసమాజ లక్షణాలు

ఆ వెంటనే గంధర్వుడు నీ పరాక్రమాన్ని మెచ్చాను’, నీతో స్నేహం చేయాలని ఉందని అర్జునుడితో అన్నాడు. అంతేకాదు, నా దగ్గర చాక్షుషి అనే విద్య ఉంది, ఆ విద్యతో మూడులోకాల్లో ఏం జరుగుతోందో చూడచ్చు, అయితే, అది అందరికీ పని చేయదు, నువ్వు తాపత్య వంశీకుడివి కనుక నీకు పనిచేస్తుంది అన్నాడు. మూడు లోకాలనూ చూడగలిగిన విద్య తన దగ్గర ఉన్నా, అర్జునుణ్ణి గుర్తించలేక ఓటమిని ఎందుకు కొని తెచ్చుకున్నాడో తెలియదు. పైగా, ఈ విద్యను తీసుకునేటప్పుడు ఆరుమాసాలపాటు ఒక వ్రతం పాటించాలని షరతు పెట్టాడు. మందుల వాళ్ళు, స్వాములు, పూజారుల బాణీని ఈ మాటల్లో మీరు పోల్చుకోవచ్చు. అంటే, వారి మూలాలు కాలగర్భంలో ఇంత లోతున ఉన్నాయన్నమాట.

మొత్తంమీద ఈ ఘటనలో అతణ్ణి ఆకర్షించింది బహుశా ఒకే ఒకటి, అది ఆగ్నేయాస్త్రం! తన దగ్గర ఎన్నో మాయలున్నాయంటున్న అతనికి అదే ఓ పెద్ద మాయగా కనిపించినట్టుంది, నీ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే మీకు గుర్రాలు ఇస్తానని బేరం పెట్టాడు.

మొత్తానికి అతని వ్యవహారం అంతా చిన్న పిల్లల తంతులా ఉంది...

(పూర్తివ్యాసం
http://magazine.saarangabooks.com/2014/03/13/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%80-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A3/ లో చదవండి)


No comments:

Post a Comment