Thursday, October 16, 2014

'సెజ్' లూ, రైతుల భూముల్ని లాక్కోవడం రోమ్ గణతంత్రం లోనూ ఉండేవి!

విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు... వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

రోమ్ గణతంత్రంలో సంభవించిన రైతుల సంక్షోభం నేడు మన దేశంలో చూస్తున్న రైతుల సంక్షోభంలానే ఉండేది.  రోమ్ లో అప్పటి ఎస్టేట్లు, రైతులు భూముల్ని కోల్పోవడం  నేటి సెజ్ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా అప్పుడు రోమ్ లో ఉండేవి. 

2 comments:

  1. 'రోమాంచిత' గణ తంత్రం!

    జిలేబి

    ReplyDelete